భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం
- March 26, 2018
భూమి వైపు మరో భారీ గ్రహశకలం దూసుకొస్తున్నట్టు నాసా గుర్తించింది. బెన్నూగా నామకరణం చేసిన ఈ గ్రహశకలం గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో భూమి వైపు వచ్చేస్తోంది. ఇది భూమిని ఢీకొంటే మానవాళి అంతం ఖాయమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ఏ రోజు భూమిని ఢీకొంటుందో కూడా నాసా అంచనా వేసింది. 2135 సెప్టెంబర్ 25న ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుంది.
ఈ గ్రహశకలం బరువు 7,900 కిలోలు. సూమారు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న రాక్షసబల్లులు అంతరించిపోవడానికి ఇలాంటి గ్రహశకలమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే బెన్నూ ను ఎదుర్కొనేందుకు నాసా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బెన్నూను అంతరిక్ష నౌక ద్వారా ఢీకొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గంటకు లక్ష కిలో మీటర్ల వేగంతో వస్తున్న బెన్నూను అంతరిక్ష నౌకతో ఢీకొట్టిస్తే.. దాని గతి మారి భూమిని ఢీకొట్టకుండా దారి మళ్లుతుందని అంచనా వేస్తున్నారు.
అది విజయవంతం కాదని భావిస్తే.. అంతరిక్ష నౌకలో అణుబాంబులు నింపి గ్రహశకలాన్ని పేల్చేయాలన్నది రెండో ఆలోచన. బెన్నూను నిరోధించేందుకు అణుబాంబులతో పేల్చేయడమే సరైన మార్గమని నాసా భావిస్తోంది. ఇంత భారీ గ్రహశకలం భూమి వైపు రావడం చాలా అరుదైనదిగా నాసా చెబుతోంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









