హెచ్ఐవీపై సమరానికి ఒమన్ న్యూ ప్లాన్
- December 01, 2015
ప్రపంచ మానవాళికి పెను సవాల్గా మారిన హెచ్ఐవీ నియంత్రణకు వివిధ దేశాలు తమవంతుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఒమన్ ప్రభుత్వం కూడా జాతీయ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. 2016 నాటికి తమ దేశంలో ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకు రానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిసీజ్ సర్విలెన్స్ అండ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైఫ్ అల్ అబ్రి ఈ విషయాన్ని ప్రకటించారు. సీనియర్ అధికారులు, మెడికల్ ప్రొఫెషనల్స్ కలిసి సుమారుగా 200 మందితో ఓ సమావేశాన్ని నిర్వహించి, హెచ్ఐవి ఎయిడ్స్పై పోరాటంలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 2020 నాటికి 90-90-90 అనే టార్గెట్తో పనిచేయనున్నట్లు డాక్టర్ అబ్రి చెప్పారు. ఈ టార్గెట్ ఉద్దేశ్యమేంటంటే 2020 నాటికి హెచ్ఐవి సోకినవారిలో 90 శాతం మంది తమకు ఆ వైరస్ సోకిందని తెలుసుకునేలా చేయడం, 90 శాతం మంది వ్యాధిగ్రస్తులు వైద్య చికిత్స అందుకునేలా చేయడం, 90 శాతం మందిలో హెచ్ఐవి వైరస్ లక్షణాలు తగ్గుముఖం పట్టేలా చేయడం. నేషనల్ టీబీ ఎయిడ్స్ మరియు లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ మొహమ్మద్ రెదా మూసా అల్ లవాతి మాట్లాడుతూ, న్యూ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









