చెన్నై ప్రజానీకానికి సాయం చేయడానికి సినీ తారలు రెడీ..
- December 01, 2015
జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న భారీవర్షాల నుంచి చెన్నై ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ సామాన్య ప్రజలతో పాటు సినీ తారలు కూడా కోరుతున్నారు. తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించటంతో పాటు అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కోరుతున్నారు. సిద్దార్థ, లారెన్స్ లాంటి మరికొంత మంది ప్రత్యక్షంగా సాయం చేయడానికి రెడీ అవుతున్నారు. వర్షాలు, వరదలు కారణంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజానీకానికి సాయం చేయడానికి హీరో సిద్దార్ధ్ ముందుకు వచ్చాడు. ఆహార పొట్లాలను ఇవ్వదలచిన వారు తనకు ఫోన్ చేయాలంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సిద్దార్థ్, సాయం చేసే ఉద్దేశం లేనివారు ఇంట్లోనే ఉండాలంటూ కోరాడు. అలాంటి వారు రోడ్ల మీదకు రావడం వల్ల సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశాడు. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితిని కూడా తన ట్విట్టర్ లో తెలిపాడు సిద్దార్ధ్. మరో తమిళ స్టార్ లారెన్స్ కూడా చెన్నై వర్షాలపై స్పందించాడు. చాలాకాలంగా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న లారెన్స్.. చెన్నై వరద బాధితుల కోసం పదిలక్షల రూపాయల ఆర్థిక సాయంప్రకటించాడు. వీరితో పాటు కుష్బూ, ఐశ్వర్య ధనుష్, అనిరుధ్, సౌందర్య రజనీకాంత్, విశాల్, అమీజాక్సన్ లాంటి కోలీవుడ్ స్టార్స్, ఇంకా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా చెన్నై పరిస్థితి పై ట్విట్టర్ లో స్పందించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









