బుధుడిని తలపిస్తున్న ఉక్కు గ్రాహం
- March 29, 2018
లండన్: పరిమాణంలో, బరువులో భూమికంటే కాస్త పెద్దగా.. బుధ గ్రహం లక్షణాలు.. అధికశాతం ఇనుము కలిగి ఉన్న ఓ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమికి దాదాపు 26 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కన్యారాశిలో ఉన్న ఈ గ్రహానికి కే2-229బీ అని పేరు పెట్టారు. కొందరు దీనిని ఉక్కుగ్రహంగా పిలుస్తున్నారు.
బ్రిటన్లోని వార్విక్ యూనివర్సిటీ, ఫ్రాన్స్లోని ఏఐఎక్స్-మార్సెయిల్లే యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం కే2 టెలిస్కోప్ను ఉపయోగించి ఈ గ్రహాన్ని కనుగొన్నారు. కే2-229బీ గ్రహం పరిమాణంలో భూమి కన్నా 20 శాతం పెద్దది. అలాగే బరువులో ఇది భూమికి రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ గ్రహం తన నక్షత్రానికి కేవలం 18 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతోంది. ఈ దూరం.. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో వందో వంతే. ఫలితంగా మధ్యాహ్న సమయంలో కే2-229బీ గ్రహం ఉపరితల ఉష్ణోగ్రత గరిష్ఠంగా 2,000 డిగ్రీల సెంటీగ్రేడ్కు వరకు చేరుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
అంతేకాదు, ఈ గ్రహం ప్రతి 14 గంటలకు ఒకసారి తన నక్షత్రం చుట్టూ తిరిగివస్తోందట. అయితే ఈ గ్రహం ఉపరితల లక్షణాలు మన సౌరవ్యవస్థలోని బుధ గ్రహంతో పోలి ఉన్నాయని వార్విక్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ ఆర్మ్స్ట్రాంగ్ పేర్కొన్నారు. కే2-229బీపై అధిక మొత్తంలో ఇనుము ఉండటంతో పరిమాణం కన్నా బరువు ఎక్కువగా ఉన్నదన్నారు.
మన సౌరవ్యవస్థలోని మొదటి గ్రహమైన బుధ గ్రహం కూడా దాని పరిమాణం కన్నా బరువు ఎక్కువగా ఉందని, సౌరవ్యవస్థలోని మిగతా గ్రహాలతో పోల్చితే బుధుడి ఆవిర్భావం కూడా భిన్నంగా సాగిందని ఆయన వివరించారు.
'కే2-229బీని చూడగానే చాలా ఆశ్చర్యపోయాం. విశ్వంలో బుధుడి లాంటి గ్రహాలు చాలా అరుదుగా ఉంటాయని ఇన్నాళ్లూ భావించాం. కానీ కే2-229బీ గ్రహం మా ఆలోచనలను మార్చింది..' అని డేవిడ్ ఆర్మ్స్ట్రాంగ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









