ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫత్తా అల్ సిసి
- March 29, 2018
కైరో : ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫత్తా అల్ సిసి రెండోసారి ఎన్నికయ్యారు. సోమవారం నుండి మూడు రోజుల పాటు సాగిన పోలింగ్లో ఆయన ఘన విజయం సాధించారు. దాదాపు 92శాతం ఓట్లు పోలయ్యాయని ప్రభుత్వ మీడియా గురువారం తెలిపింది. దాదాపు 6కోట్ల మంది రిజిస్టర్ అయిన ఓటర్లు వుండగా వారిలో 2.3కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికార మేనా వార్తా సంస్థ తెలిపింది. సిసి ఏకైక ప్రత్యర్థి, అల్ గద్ పార్టీ చీఫ్ మొసా ముస్తఫాకు కేవలం మూడు శాతం ఓట్లు లభించాయి. అయితే అధికారికంగా ఫలితాన్ని ఏప్రిల్ 2వ తేదిన ప్రకటిస్తారు. ఎన్నికల బరిలోని కొంతమంది అభ్యర్ధులను అరెస్టు చేయడమో లేదా అడ్డగించడమో జరగడం, సిసి ప్రత్యర్థి ముస్తఫా ఒక్కరే బరిలో మిగలడంతో సిసి విజయావకాశాలు పెరిగాయి. పోలింగ్ కేంద్రాల వెలుపల బారులు తీరి నిలుచున్న ఓటర్లు తనకు గర్వకారణమని, మన జాతి గొప్పతనానికి నిదర్శనమని సిసి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







