ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫత్తా అల్ సిసి
- March 29, 2018
కైరో : ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫత్తా అల్ సిసి రెండోసారి ఎన్నికయ్యారు. సోమవారం నుండి మూడు రోజుల పాటు సాగిన పోలింగ్లో ఆయన ఘన విజయం సాధించారు. దాదాపు 92శాతం ఓట్లు పోలయ్యాయని ప్రభుత్వ మీడియా గురువారం తెలిపింది. దాదాపు 6కోట్ల మంది రిజిస్టర్ అయిన ఓటర్లు వుండగా వారిలో 2.3కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికార మేనా వార్తా సంస్థ తెలిపింది. సిసి ఏకైక ప్రత్యర్థి, అల్ గద్ పార్టీ చీఫ్ మొసా ముస్తఫాకు కేవలం మూడు శాతం ఓట్లు లభించాయి. అయితే అధికారికంగా ఫలితాన్ని ఏప్రిల్ 2వ తేదిన ప్రకటిస్తారు. ఎన్నికల బరిలోని కొంతమంది అభ్యర్ధులను అరెస్టు చేయడమో లేదా అడ్డగించడమో జరగడం, సిసి ప్రత్యర్థి ముస్తఫా ఒక్కరే బరిలో మిగలడంతో సిసి విజయావకాశాలు పెరిగాయి. పోలింగ్ కేంద్రాల వెలుపల బారులు తీరి నిలుచున్న ఓటర్లు తనకు గర్వకారణమని, మన జాతి గొప్పతనానికి నిదర్శనమని సిసి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







