పీవీ సింధూకు రూ.10 లక్షల నగదు నజరానా
- December 02, 2015
ప్రపంచంలో 12వ ర్యాంక్లో ఉన్న సింధూకు 10 లక్షల నగదు నజరానా మకావు టోర్నీ గెలిచిన పీవీ సింధూపై కనక వర్షం కురువనుంది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పీవీ సింధూకు రూ.10 లక్షల నగదు నజరానా ప్రకటించింది. ప్రపంచంలో 12వ ర్యాంక్లో ఉన్న సింధూ మకావు ఓపెన్ ఫైనల్లో ఆరవ ర్యాంక్ ప్లేయర్ మిటానిపై 21-9, 21-23, 21-14 స్కోర్తో గెలుపొందిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ శ్రేణిలో మరోసారి సింధూ తన ప్రతిభను చాటిందని బ్యాడ్మింటన్ సంఘం పేర్కొంది. టోర్నీకి వెళ్లేముందే సింధూపైన నమ్మకం ఉందని, అనుకున్నట్లుగానే ఆమె టైటిల్ను సొంతం చేసుకుందని బాయ్ ప్రెసిడెంట్ అఖిలేష్ దాస్ గుప్తా అన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







