పీవీ సింధూకు రూ.10 లక్షల నగదు నజరానా

- December 02, 2015 , by Maagulf
పీవీ సింధూకు రూ.10 లక్షల నగదు నజరానా

ప్రపంచంలో 12వ ర్యాంక్‌లో ఉన్న సింధూకు 10 లక్షల నగదు నజరానా మకావు టోర్నీ గెలిచిన పీవీ సింధూపై కనక వర్షం కురువనుంది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పీవీ సింధూకు రూ.10 లక్షల నగదు నజరానా ప్రకటించింది. ప్రపంచంలో 12వ ర్యాంక్‌లో ఉన్న సింధూ మకావు ఓపెన్ ఫైనల్లో ఆరవ ర్యాంక్ ప్లేయర్ మిటానిపై 21-9, 21-23, 21-14 స్కోర్‌తో గెలుపొందిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ శ్రేణిలో మరోసారి సింధూ తన ప్రతిభను చాటిందని బ్యాడ్మింటన్ సంఘం పేర్కొంది. టోర్నీకి వెళ్లేముందే సింధూపైన నమ్మకం ఉందని, అనుకున్నట్లుగానే ఆమె టైటిల్‌ను సొంతం చేసుకుందని బాయ్ ప్రెసిడెంట్ అఖిలేష్ దాస్ గుప్తా అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com