దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం అక్రమ రవాణా
- March 31, 2018
సాధారణంగా అంతర్జాతీయ విమానాల్లో బంగారం తరలిస్తే కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కడం ఖాయం. దీంతో స్మగ్లింగ్ ముఠా దేశీయ ప్రయాణీకుల ముసుగులో బంగారం అక్రమ రవాణా సాగిస్తోంది. ఈ మేరకు దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం రవాణా చేసేందుకు కనెక్టింగ్ ప్లైట్ లను ఎంచుకుంటున్నారు. దేశీయ ప్రయాణీకులకు కస్టమ్స్ చెకింగ్ ఇబ్బందులు ఉండవు. దీంతో దుబాయ్ నుండి ముంబాయి మీదుగా హైదరాబాద్ కు వచ్చే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణిస్తున్న ఈ ముఠా దర్జాగా బంగారం అక్రమ రవాణా ను కొనసాగిస్తోంది. దీంతో కస్టమ్స్ అధికారులు ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఫలితంగా ఇటీవల ఓ ప్రయాణీకుడు ఇలా విమానం లో కిలోకు పైగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించి అడ్డం గా దొరికిపోయాడు. ఇది జరిగి కొన్ని రోజులైనా గడవక ముందే తాజాగా మరో ప్రయాణీకుడు జెడ్డా నుండి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లో కిలోకు పైగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. కస్టమ్స్ అధికారులుఈ కేటుగాడికి చెక్ పెట్టి 1.243 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









