దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం అక్రమ రవాణా
- March 31, 2018
సాధారణంగా అంతర్జాతీయ విమానాల్లో బంగారం తరలిస్తే కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కడం ఖాయం. దీంతో స్మగ్లింగ్ ముఠా దేశీయ ప్రయాణీకుల ముసుగులో బంగారం అక్రమ రవాణా సాగిస్తోంది. ఈ మేరకు దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం రవాణా చేసేందుకు కనెక్టింగ్ ప్లైట్ లను ఎంచుకుంటున్నారు. దేశీయ ప్రయాణీకులకు కస్టమ్స్ చెకింగ్ ఇబ్బందులు ఉండవు. దీంతో దుబాయ్ నుండి ముంబాయి మీదుగా హైదరాబాద్ కు వచ్చే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణిస్తున్న ఈ ముఠా దర్జాగా బంగారం అక్రమ రవాణా ను కొనసాగిస్తోంది. దీంతో కస్టమ్స్ అధికారులు ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఫలితంగా ఇటీవల ఓ ప్రయాణీకుడు ఇలా విమానం లో కిలోకు పైగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించి అడ్డం గా దొరికిపోయాడు. ఇది జరిగి కొన్ని రోజులైనా గడవక ముందే తాజాగా మరో ప్రయాణీకుడు జెడ్డా నుండి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లో కిలోకు పైగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. కస్టమ్స్ అధికారులుఈ కేటుగాడికి చెక్ పెట్టి 1.243 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







