దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం అక్రమ రవాణా
- March 31, 2018
సాధారణంగా అంతర్జాతీయ విమానాల్లో బంగారం తరలిస్తే కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కడం ఖాయం. దీంతో స్మగ్లింగ్ ముఠా దేశీయ ప్రయాణీకుల ముసుగులో బంగారం అక్రమ రవాణా సాగిస్తోంది. ఈ మేరకు దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం రవాణా చేసేందుకు కనెక్టింగ్ ప్లైట్ లను ఎంచుకుంటున్నారు. దేశీయ ప్రయాణీకులకు కస్టమ్స్ చెకింగ్ ఇబ్బందులు ఉండవు. దీంతో దుబాయ్ నుండి ముంబాయి మీదుగా హైదరాబాద్ కు వచ్చే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణిస్తున్న ఈ ముఠా దర్జాగా బంగారం అక్రమ రవాణా ను కొనసాగిస్తోంది. దీంతో కస్టమ్స్ అధికారులు ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఫలితంగా ఇటీవల ఓ ప్రయాణీకుడు ఇలా విమానం లో కిలోకు పైగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించి అడ్డం గా దొరికిపోయాడు. ఇది జరిగి కొన్ని రోజులైనా గడవక ముందే తాజాగా మరో ప్రయాణీకుడు జెడ్డా నుండి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లో కిలోకు పైగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. కస్టమ్స్ అధికారులుఈ కేటుగాడికి చెక్ పెట్టి 1.243 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ







