దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం అక్రమ రవాణా
- March 31, 2018
సాధారణంగా అంతర్జాతీయ విమానాల్లో బంగారం తరలిస్తే కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కడం ఖాయం. దీంతో స్మగ్లింగ్ ముఠా దేశీయ ప్రయాణీకుల ముసుగులో బంగారం అక్రమ రవాణా సాగిస్తోంది. ఈ మేరకు దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం రవాణా చేసేందుకు కనెక్టింగ్ ప్లైట్ లను ఎంచుకుంటున్నారు. దేశీయ ప్రయాణీకులకు కస్టమ్స్ చెకింగ్ ఇబ్బందులు ఉండవు. దీంతో దుబాయ్ నుండి ముంబాయి మీదుగా హైదరాబాద్ కు వచ్చే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణిస్తున్న ఈ ముఠా దర్జాగా బంగారం అక్రమ రవాణా ను కొనసాగిస్తోంది. దీంతో కస్టమ్స్ అధికారులు ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఫలితంగా ఇటీవల ఓ ప్రయాణీకుడు ఇలా విమానం లో కిలోకు పైగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించి అడ్డం గా దొరికిపోయాడు. ఇది జరిగి కొన్ని రోజులైనా గడవక ముందే తాజాగా మరో ప్రయాణీకుడు జెడ్డా నుండి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లో కిలోకు పైగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. కస్టమ్స్ అధికారులుఈ కేటుగాడికి చెక్ పెట్టి 1.243 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







