హౌతీ మిసైల్ని ధ్వంసం చేసిన సౌదీ
- March 31, 2018
రియాద్: సౌదీ ఎయిర్ డిఫెన్స్, హౌతీ మిలీషియా సంధించిన మిస్సైల్ని ధ్వంసం చేసింది. కింగ్డమ్కి చెందిన సదరన్ సిటీ నజ్రాన్ వైపుగా దూసుకొస్తున్న మిస్సైల్ని ధ్వంసం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ లక్ష్యంగా ఈ మిస్సైల్ని సంధించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. విజయవంతంగా మిస్సైల్ని అడ్డగించామనీ, ఈ క్రమంలో మిస్సైల్ తాలకు శకలాలు రెసిడెన్షియల్ ఏరియాలో పడ్డాయనీ, ఓ భారతీయ వలసదారుడికి వీటి కారణంగా స్వల్ప గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. యెమెన్ నుంచి తరచూ హౌతీ మిలీషియా సౌదీ అరేబియాలోని ముఖ్య నగరాలపైకి మిస్సైల్స్తో విరుచుకుపడుతుండడం జరుగుతున్నా, సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఎప్పటికప్పుడు చాకచక్యంగా ఆ మిస్సైల్స్ని గగనతలంలోనే కూల్చివేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







