ముగిసిన మస్కట్ ఫిలిం ఫెస్టివల్
- March 31, 2018మస్కట్: 10వ మస్కట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ శనివారం ముగిసింది. బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా, దర్శకుడు అలీ బద్రాఖాన్, నటుడు దావూద్ హుస్సేన్, నటి ఫక్రియా ఖామిస్, జహ్రా అరాఫత్ తదితరులు ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగర్ మెహర్ ఖాన్ సహా పలువురు కళాకారుల ప్రదర్శనల్ని ప్రేక్షకులు ఆస్వాదించారు. సాయంత్రం 6.30 నిమిషాలకు రెడ్ కార్పెట్ కార్యక్రమం జరిగింది. ఒమనీ జాతీయ గీతంతో ఈవెంట్ ప్రారంభమయ్యింది. ఒమన్ ఫిలిం సొసైటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ అల్ కింది ప్రారంభోపన్యాసం చేశారు. సలాలా నుంచి వచ్చిన బృందం ప్రదర్శించిన ఫోక్ బ్యాండ్ ఆహూతుల్ని అలరించింది. ఎంఐఎఫ్ఎఫ్ సినిమా అవార్డులు, హానరీ అవార్డుల్ని ఈ వేదికపై విజేతలకు అందించారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం