మీడియా పై చైనా సీరియస్
- April 02, 2018బీజింగ్ : స్కైల్యాబ్ స్పేస్ స్టేషన్ కూలిపోవటంపై గత రెండు రోజులుగా ప్రపంచ మీడియాలో వస్తున్న కథనాలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏరో స్పేస్ రంగంలో చైనా ఎదుగుదలను భరించలేక బురద జల్లుతు.. మీడియా ఛానెళ్లు అతి ప్రదర్శించాయంటూ దుమ్మెత్తిపోసింది.
‘అదొక సాధారణ స్పేస్క్రాఫ్ట్. అయినా కూలిపోతే ఏదో విపత్తు సంభవిస్తుందన్న స్థాయిలో అధిక ప్రాధాన్యం ఇస్తూ అంతర్జాతీయ మీడియా ఛానెళ్లు కథనాలు ప్రచురించాయి. చైనా అంతరిక్ష రంగాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి చేష్టలకు పాల్పడ్డాయి. కొందరైతే అది ఎక్కడ కూలిపోతుందో చెబుతూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించారు’ అంటూ చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
కాగా, దాదాపు 11 మీటర్లు ఉన్న తియాంగాంగ్-1ను చైనా 2011లో ప్రయోగించింది. కాలపరిమితి ముగియటంతో 2017లోనే ఇది కూలిపోతుందని భావించినప్పటికీ.. కాస్త ఆలస్యం అయ్యింది. చివరకు ఆదివారం అర్ధరాత్రి దాటాక భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మంటలు చెలరేగి దగ్ధమైపోయినట్లు చైనా స్పేస్ విభాగం వెల్లడించింది. ఆ శకలాలు ఫసిఫిక్ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో పడిపోయినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్