అల్ అయిన్ ఇండియన్ సోషల్ సెంటర్ కొత్త భవనంలోకి
- April 02, 2018
అబుదాబీ: అల్ అయిన్లోని ఇండియన్ సోషల్ సెంటర్, కొత్త ప్రాంగణంలోకి మారనుంది. గురువారం లాంఛనంగా ఈ కార్యక్రమం జరిగింది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో రిజిస్టర్ అయిన 43 ఏళ్ళ అనుభవం వున్న ఐఎస్సి, సోషియో కల్చరల్ యాక్టివిటీస్కి పెట్టింది పేరు. అల్ అయిన్లో నివసిస్తోన్న 60,000 మంది ఇండియన్స్కి ఈ ఐఎస్సి ఓ కేంద్రంగా పేరొందింది. కొత్త సెంటర్, అల్ అయిన్లోని ఖాబిసి డిస్ట్రిక్ట్లో ఏర్పాటయ్యింది. సిటీ సెంటర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు. లాంఛనంగా సెంటర్ని ప్రారంభించే క్రమంలో మూడు రోజులపాటు ఇండియా ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారుారు. 30 వరకు స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఫుడ్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్తో ఈ వేడుకలకు కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. శనివారం జరిగే డ్రాలో 25 ఎట్రాక్టివ్ ప్రైజ్లు వున్నాయి. అందులో కారుని గ్రాండ్ ప్రైజ్గా అందిస్తున్నట్లు సెంటర్ హానరరీ ప్రెసిడెంట్ డాక్టర్ శవి స్టీఫెన్ చెప్పారు. మ్యూజికల్, డాన్స్ షోలు కూడా ఈ ఈవెంట్లో భాగం కానున్నాయి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







