అల్ అయిన్ ఇండియన్ సోషల్ సెంటర్ కొత్త భవనంలోకి
- April 02, 2018
అబుదాబీ: అల్ అయిన్లోని ఇండియన్ సోషల్ సెంటర్, కొత్త ప్రాంగణంలోకి మారనుంది. గురువారం లాంఛనంగా ఈ కార్యక్రమం జరిగింది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో రిజిస్టర్ అయిన 43 ఏళ్ళ అనుభవం వున్న ఐఎస్సి, సోషియో కల్చరల్ యాక్టివిటీస్కి పెట్టింది పేరు. అల్ అయిన్లో నివసిస్తోన్న 60,000 మంది ఇండియన్స్కి ఈ ఐఎస్సి ఓ కేంద్రంగా పేరొందింది. కొత్త సెంటర్, అల్ అయిన్లోని ఖాబిసి డిస్ట్రిక్ట్లో ఏర్పాటయ్యింది. సిటీ సెంటర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు. లాంఛనంగా సెంటర్ని ప్రారంభించే క్రమంలో మూడు రోజులపాటు ఇండియా ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారుారు. 30 వరకు స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఫుడ్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్తో ఈ వేడుకలకు కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. శనివారం జరిగే డ్రాలో 25 ఎట్రాక్టివ్ ప్రైజ్లు వున్నాయి. అందులో కారుని గ్రాండ్ ప్రైజ్గా అందిస్తున్నట్లు సెంటర్ హానరరీ ప్రెసిడెంట్ డాక్టర్ శవి స్టీఫెన్ చెప్పారు. మ్యూజికల్, డాన్స్ షోలు కూడా ఈ ఈవెంట్లో భాగం కానున్నాయి.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









