నేటినుండి కామన్వెల్త్ గేమ్స్
- April 03, 2018
గోల్డ్కోస్ట్ : ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ క్వీన్స్లాండ్ లోని కర్రారా మైదానంలో నేటినుండి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 నుండి 15 వరకు జరిగే ఈ గేమ్స్లో 71 దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలను చూపనున్నారు. 19 క్రీడాంశాలలో 275 విభాగాలలో స్వర్ణ, రజిత, కాంస్య పతకాలకై వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు పోటీపడనున్నారు. భారతదేశం తరఫునుండి 15 క్రీడాంశాల్లో 115మంది పురుషులు, 105మంది మహిళలతో సహా మొత్తం 220 మంది ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో తమ ప్రతిభను చూపి పతకాలు సాధించడానికి కృషి చేయనున్నారు. కామన్వెల్త్ క్రీడా గ్రామంలోకి తన తండ్రి హర్వీర్ సింగ్ను అనుమతించకపోతే బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తప్పుకుంటానని ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ హెచ్చరించింది. ఈ మేరకు ఆమె భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతాకు మంగళవారం లేఖ రాస్తూ... తన తండ్రికి అక్రిడేషన్ కల్పించాలని సైనా ఆ లేఖలో కోరింది. ఈ లేఖకు తలొగ్గి దిగొచ్చిన ఐఓఏ సైనా తండ్రిని కామన్వెల్త్ గేమ్స్కు అనుమతిస్తూ... అతను సైనా మ్యాచ్లన్నీ చూడవచ్చని స్పష్టం చేసింది. సైనా నెహ్వాల్ ఆ లేఖలో తన తండ్రి మద్దతు లేకుండా తాను బ్యాడ్మింటన్ ఆడలేనని... అందుకే ఆయన్ను అన్ని మ్యాచ్లకు తీసుకెళ్తుంటానని అన్నారు. తొలుత టీమ్ అధికారిగా తన తండ్రిని ధ్రువీకరించడంతో ఆయన ఖర్చులన్నీ తనే భరించి తీసుకొచ్చానని, తీరా ఇక్కడికి వచ్చాక ఆ పేరును టీమ్ అధికారిక జాబితా నుంచి ఐఓఏ అధికారులు తొలగించారని సైనా ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







