న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త..
- April 05, 2018
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త. మీరు ప్రయాణించనున్న విమాన సర్వీసు రద్దు అయినా, విమానం రాకపోకల్లో జాప్యం జరిగినా, మీ సామాను పోయినా, దెబ్బతిన్నా ప్రయాణికులకు అధిక నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా ప్రతిపాదించింది. అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో సామగ్రి పోయినా, దెబ్బతిన్న కిలోకు మూడువేల రూపాయలు ప్రస్థుతం చెల్లిస్తున్నారు. కాని దెబ్బతిన్న సామాన్ల కోసం పరిహారాన్ని 20వేల నుంచి లక్షరూపాయల వరకు పెంచాలని విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. విమానం మిస్ అయినా, లేక పొరపాటున బోర్డింగును తిరస్కరించినా ప్రయాణికులకు రూ.3,000 నుంచి 20వేల రూపాయల వరకు పరిహారం చెల్లించాలని విమానయాన మంత్రిత్వశాఖలో ఉన్న నిబంధనలు మార్చాలని అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









