న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త..

- April 05, 2018 , by Maagulf
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త..

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త. మీరు ప్రయాణించనున్న విమాన సర్వీసు రద్దు అయినా, విమానం రాకపోకల్లో జాప్యం జరిగినా, మీ సామాను పోయినా, దెబ్బతిన్నా ప్రయాణికులకు అధిక నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా ప్రతిపాదించింది. అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో సామగ్రి పోయినా, దెబ్బతిన్న కిలోకు మూడువేల రూపాయలు ప్రస్థుతం చెల్లిస్తున్నారు. కాని దెబ్బతిన్న సామాన్ల కోసం పరిహారాన్ని 20వేల నుంచి లక్షరూపాయల వరకు పెంచాలని విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. విమానం మిస్ అయినా, లేక పొరపాటున బోర్డింగును తిరస్కరించినా ప్రయాణికులకు రూ.3,000 నుంచి 20వేల రూపాయల వరకు పరిహారం చెల్లించాలని విమానయాన మంత్రిత్వశాఖలో ఉన్న నిబంధనలు మార్చాలని అధికారులు నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com