ట్యాక్సీ ధరల్ని సవరించిన అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
- April 05, 2018
అజ్మన్:అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ట్యాక్సీ కంపెనీలకు సంబంధించి ధరల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. స్థానిక ట్రాన్స్పోర్ట్ సర్వీసులను మెరుగుపర్చడం, అజ్మన్ విజన్ 2021 లక్ష్యాన్ని చేరుకునేందుకుగాను తగిన వ్యూహాల్ని అమలు చేయడంలో బాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ సర్వేలు, స్టడీస్ నిర్వహించిన తర్వాతే కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర ఎమిరేట్స్కి సంబంధించిన పలు విషయాల్ని పరిశీలించి, అజ్మన్లో ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిగణనలోకి తీసుకుని, అత్యుత్తమ సేవలు వారి నుంచి ప్రయాణీకులకు అందేలా ఈ చర్యలు చేపట్టడం జరిగింది.2.5 అరబ్ ఎమిరేట్ దినార్స్ని పెంచడం ద్వారా ట్యాక్సీ డ్రైవర్లకు ఊరట కలిగినట్లయ్యింది. అయినప్పటికీ కూడా ఇతర ఎమిరేట్లతో పోల్చితే అజ్మన్లో ట్యాక్సీ ఛార్జీలు తక్కువేనని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









