మర్డర్ మిస్టరీని 24 గంటల్లో ఛేదించిన ఆర్ఎకె పోలీస్
- April 07, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా పోలీస్, ఓ మర్డర్ కేస్ని కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. అరబ్ వర్కర్ హత్యకేసుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం. రస్ అల్ ఖైమా పోలీస్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా అలి మెనఖాస్ మాట్లాడుతూ, అరబ్ వర్కర్ హత్యకు గురైనట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యిందని చెప్పారు. ఈ కేసు విచారణ కోసం ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశామనీ, విచారణలో మృతుడి రూమ్ మేట్ ఈ హత్యకు కారకుడిగా గుర్తించామని అధికారులు తెలిపారు. తరచూ ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవని నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఓ సందర్భంలో గొడవలు ఎక్కువైపోయాయనీ, ఈ నేపథ్యంలో రూమ్ మేట్ నిద్రిస్తున్న సమయంలో నిందితుడు అతన్ని, కటింగ్ టూల్తో చంపేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. చంపేసిన తర్వాత మృతుడి నోట్లో విషాన్ని పోసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు నిందితుడు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







