మంగళగిరిలో సంతోష నగరాల సదస్సు ప్రారంభం

- April 10, 2018 , by Maagulf
మంగళగిరిలో సంతోష నగరాల సదస్సు ప్రారంభం

అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరిలో సంతోష నగరాల సదస్సు (హాపీ సిటీస్‌ సమ్మిట్‌) మంగళవారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ ఈ సదస్సును ప్రారంభించారు. ''మా తెలుగు తల్లికి మల్లెపూ దండ'' అనే అచ్చమై తెలుగు పాటతో సదస్సును ప్రారంభించారు. ప్రజలకు సంతోషకరమైన జీవితాన్ని అందించడమే హ్యాపీ సిటీస్‌ లక్ష్యంగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, పలు నగరాలకు చెందిన మేయర్లు హాజరయ్యారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగనున్నది. రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్‌డిఎ, సిఐఐ, లివబుల్‌ సిటీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ముగింపు సదస్సుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com