ఫ్లాష్ ఫ్లాష్..మోడీ మనస్తాపం, 12న నిరాహార దీక్ష
- April 10, 2018
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరుపై ఇరువురు సమీక్షించారు.
పార్లమెంటులో విపక్షాల తీరుపై మనస్తాపం చెందిన ప్రధాని మోడీ వారి తీరుకు నిరసనగా ఒకరోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. బీజేపీ ఎంపీలతో కలిసి ఈ నెల 12న నిరాహార దీక్ష చేస్తారు.
ప్రధాని నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శలు
ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. పార్లమెంటు ముగిసిన వారం రోజుల తర్వాత మోడీ నిద్రలేచారని ఎద్దేవా చేసింది. అన్నాడీఎంకేతో పాటు ఇతర పార్టీల ఆందోళన కారణంగా రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో 23 రోజుల పాటు సభా కార్యక్రమాలు స్తంభించాయి.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీకు చర్చకు రాలేదు. టీఆర్ఎస్తో పాటు కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నిరసనలు వ్యక్తం చేయడంతో సభ సజావుగా సాగలేదు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









