ఫ్లాష్ ఫ్లాష్..మోడీ మనస్తాపం, 12న నిరాహార దీక్ష
- April 10, 2018
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరుపై ఇరువురు సమీక్షించారు.
పార్లమెంటులో విపక్షాల తీరుపై మనస్తాపం చెందిన ప్రధాని మోడీ వారి తీరుకు నిరసనగా ఒకరోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. బీజేపీ ఎంపీలతో కలిసి ఈ నెల 12న నిరాహార దీక్ష చేస్తారు.
ప్రధాని నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శలు
ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. పార్లమెంటు ముగిసిన వారం రోజుల తర్వాత మోడీ నిద్రలేచారని ఎద్దేవా చేసింది. అన్నాడీఎంకేతో పాటు ఇతర పార్టీల ఆందోళన కారణంగా రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో 23 రోజుల పాటు సభా కార్యక్రమాలు స్తంభించాయి.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీకు చర్చకు రాలేదు. టీఆర్ఎస్తో పాటు కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నిరసనలు వ్యక్తం చేయడంతో సభ సజావుగా సాగలేదు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







