24 రోజుల్లో 59 మంది టెర్రర్ అనుమానితుల అరెస్ట్
- April 18, 2018
జెడ్డా:గడచిన 24 రోజుల్లో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనీ, సహకరిస్తున్నారనీ ఆరోపణల మేరకు 59 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ పేర్కొంది. వీరిలో 33 మంది సౌదీలు, 13 టర్కీలు, ఏడుగురు ఎమనీలు, ఇద్దరు ఈజిప్టియన్లు, ఇద్దరు ఆఫ్గాన్లు, ఓ కెన్యన్, ఓ నైజీరియన్ వున్నారు. తొలిసారిగా శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని మార్చి 7న అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 1న కెన్యాకి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫ్రెంచ్ వ్యక్తినీ, ఇద్దరు కెనడియన్లనీ, ఇద్దరు రష్యన్లనీ, ఐదుగురు అమెరికన్లనూ తీవ్రవాద నేరాభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. యెమనీసల్లో 320 మంది తీవ్రవాద అనుమానితులున్నారు. సిరియన్లు 206 మంది, పాకిస్తానీలు 79 మంది వున్నారు. మొత్తం 5305 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు నఫెతాహ్ వెబ్సైట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్









