మాట్లాతుంటే నోరు వాసన వస్తోందా...?
- April 20, 2018
కొంతమంది మాట్లాడుతున్న, నవ్వుతున్నా నోరు వాసన వస్తుంది. నోరు దుర్వాసన రావడానికి పళ్లు సరిగా బ్రెష్ చేసుకోకపోవడం, చిగుళ్ల సమస్యలతో బాధపడటం, పళ్లపై గారలు ఏర్పడి ఎన్నిసార్లు శుభ్ర పరచుకున్నా పోకపోవడం లాంటి అనేక కారణాలు ఉంటాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, పళ్లు తెల్లగా ఉండి నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలన్నా వంటింట్లో ఉండే ఉప్పు చాలా ఉపయోగపడుతుంది.
పళ్లను శుభ్రపరచుకోవడానికి ఉప్పును ఈక్రింది విధంగా వాడవచ్చు....
1. కొంచెం ఉప్పు తీసుకొని దానిలో నీరు పోసి పేస్టులా చేసుకొని, బ్రష్తో పళ్లు తోముకుంటే తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఉప్పు నోటిలో ఉండే బ్యాక్టిరియాను చంపుతుంది. చిగుళ్లు, పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది.
2. రోజూ ఉదయం పళ్లు శుభ్రపరచుకున్న తర్వాత గోరువెచ్చని నోటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించాలి. ఆతర్వాత తిరిగి నోటిని మంచి నీటితో శుభ్రపరచాలి. ఈవిధంగా రోజు చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.
3. కొంచెం మిరియాల పొడి, పసుపు, ఉప్పు కలిపి దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసి పేస్టులా చేసి దాంతో చిగుళ్లను రుద్దితే చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా మనం వాడుకునే పేస్టుపై కొంచెం ఉప్పు వేసి తోముకుంటే పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
4. నిమ్మతొక్కలను పొడి చేసి దాంట్లో ఉప్పు కలిపి ఒక సీసాలో పోసుకొని రోజూ కొంచెం పొడి తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసి పళ్లు తోముకుంటే అందంగా మెరుస్తూ ఉంటాయి.
5. బ్రెడ్ను కాల్చి పొడి చేసి దాంట్లో తేనె కొంచెం ఉప్పు కలిపి పళ్లను రుద్దితే పళ్లపై గార పోతుంది.
6. నోటి దుర్వాసనతో బాధ పడేవారు ఉప్పు, బేకింగ్ సోడా సమపాళ్లల్లో కలిపి పళ్లపొడిలా తయారుచేసుకొని రోజు పళ్లు తోముకుంటుంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







