దుబాయ్:మర్డర్ మిస్టరీ: 24 గంటల్లో ఛేదన
- April 20, 2018దుబాయ్:ఇథియోపియన్ మహిళ హత్య కేసులో నిందితుడ్ని ఇరవై నాలుగ్గంటల్లోనే దుబాయ్ పోలీస్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దుబాయ్ పోలీస్, క్రిమినల్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరీ మాట్లాడుతూ, ఆఫ్రికాకి చెందిన ఓ మహిళ చనిపోయిన విషయమై తమకు సమాచారం అందిందనీ, బరాహా ఏరియాలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగిందనీ, సంఘటనా స్థలానికి వెంటనే పోలీస్ చేరుకున్నాయని తెలిపారు. అక్కడికి వెళ్ళిన పోలీసులకు డికంపోజ్ స్థితిలో వున్న మహిళ మృతదేహం కన్పించింది. బాధితురాల్ని గుర్తించిన పోలీసులకు, ఆమెతో ఓ పాకిస్తానీకి సంబంధం వున్నట్లు నిర్ధారణ అయ్యింది. విచారణలో భాగంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనితో నిజం చెప్పించారు. ఆమెతో శృంగారంలో రెండుసార్లు పాల్గొని 200 దిర్హామ్లు చెల్లించాననీ, ఇంకాస్త సమయం వుండి, మరింత సొమ్ము చెల్లించాల్సిందిగా ఆ మహిళ డిమాండ్ చేయడంతో, ఆమెను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బుని దొంగిలించి, మొబైల్ ఫోన్లనూ తీసుకుని పారిపోయినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక