హైదరాబాద్ పై కోల్కతా విజయం
- May 21, 2024
అహ్మదాబాద్: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది.160 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా ఇంకా 38 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కేవలం 1.34 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 164 పరుగులతో లక్ష్యాన్ని కోల్కతా ఛేదించింది.ఫలితంగా హైదరాబాద్ను ఓడించి.. కేకేఆర్ ఫైనల్కు దూసుకెళ్లింది. దాంతో ఐపీఎల్ 2024 సీజన్లో ఫస్ట్ ఫైనలిస్టుగా కోల్కతా నిలిచింది.
కోల్కతా ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (23) సునీల్ నరైన్ (21) పరుగులతో మంచి శుభారంభాన్ని అందించగా.. వెంకటేష్ అయ్యర్ (51 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచి అదరగొట్టారు. హైదరాబాద్ స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి కోల్కతాను విజయతీరాలకు చేర్చారు. హైదరాబాద్ బౌలర్లో కెప్టెన్ పాట్ కమిన్స్, టి నటరాజన్ తలో వికెట్ తీసుకున్నారు.హైదరాబాద్ పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్ (3/34)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది.ప్రత్యర్థి జట్టు కోల్కతాకు 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లలో ట్రావిస్ హెడ్ ఆదిలోనే చేతులేత్తేయగా అభిషేక్ వర్మ (3) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 13.2 ఓవర్లో జట్టు స్కోరు 121 వద్ద త్రిపాఠిని ఆండ్రీ రసెల్ రనౌట్ చేయడంతో 6వ వికెట్గా వెనుదిరిగాడు.
మిగతా ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెస్ (32) పరుగులతో రాణించగా, అబ్దుల్ సమద్ (16) పేలవ ప్రదర్శనతో నిష్ర్కమించాడు. చివరిలో పాట్ కమిన్స్ (30)తో మెరిసినప్పటికీ ఆండ్రీ రస్సె ల్ బౌలింగ్లో రహ్మానుల్లాకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. విజయ్ కాంత్ వియస్కాంత్ (7 నాటౌట్)కు పరిమితయ్యాడు.
మొత్తానికి హైదరాబాద్ ఆటగాళ్లు క్వాలిఫైయర్ -1లో పేలవ ప్రదర్శనతో బ్యాటింగ్లో తేలిపోయారు. కోల్కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ననరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ







