దుబాయ్:మర్డర్ మిస్టరీ: 24 గంటల్లో ఛేదన
- April 20, 2018
దుబాయ్:ఇథియోపియన్ మహిళ హత్య కేసులో నిందితుడ్ని ఇరవై నాలుగ్గంటల్లోనే దుబాయ్ పోలీస్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దుబాయ్ పోలీస్, క్రిమినల్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరీ మాట్లాడుతూ, ఆఫ్రికాకి చెందిన ఓ మహిళ చనిపోయిన విషయమై తమకు సమాచారం అందిందనీ, బరాహా ఏరియాలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగిందనీ, సంఘటనా స్థలానికి వెంటనే పోలీస్ చేరుకున్నాయని తెలిపారు. అక్కడికి వెళ్ళిన పోలీసులకు డికంపోజ్ స్థితిలో వున్న మహిళ మృతదేహం కన్పించింది. బాధితురాల్ని గుర్తించిన పోలీసులకు, ఆమెతో ఓ పాకిస్తానీకి సంబంధం వున్నట్లు నిర్ధారణ అయ్యింది. విచారణలో భాగంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనితో నిజం చెప్పించారు. ఆమెతో శృంగారంలో రెండుసార్లు పాల్గొని 200 దిర్హామ్లు చెల్లించాననీ, ఇంకాస్త సమయం వుండి, మరింత సొమ్ము చెల్లించాల్సిందిగా ఆ మహిళ డిమాండ్ చేయడంతో, ఆమెను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బుని దొంగిలించి, మొబైల్ ఫోన్లనూ తీసుకుని పారిపోయినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







