దుబాయ్:మర్డర్ మిస్టరీ: 24 గంటల్లో ఛేదన
- April 20, 2018
దుబాయ్:ఇథియోపియన్ మహిళ హత్య కేసులో నిందితుడ్ని ఇరవై నాలుగ్గంటల్లోనే దుబాయ్ పోలీస్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దుబాయ్ పోలీస్, క్రిమినల్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరీ మాట్లాడుతూ, ఆఫ్రికాకి చెందిన ఓ మహిళ చనిపోయిన విషయమై తమకు సమాచారం అందిందనీ, బరాహా ఏరియాలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగిందనీ, సంఘటనా స్థలానికి వెంటనే పోలీస్ చేరుకున్నాయని తెలిపారు. అక్కడికి వెళ్ళిన పోలీసులకు డికంపోజ్ స్థితిలో వున్న మహిళ మృతదేహం కన్పించింది. బాధితురాల్ని గుర్తించిన పోలీసులకు, ఆమెతో ఓ పాకిస్తానీకి సంబంధం వున్నట్లు నిర్ధారణ అయ్యింది. విచారణలో భాగంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనితో నిజం చెప్పించారు. ఆమెతో శృంగారంలో రెండుసార్లు పాల్గొని 200 దిర్హామ్లు చెల్లించాననీ, ఇంకాస్త సమయం వుండి, మరింత సొమ్ము చెల్లించాల్సిందిగా ఆ మహిళ డిమాండ్ చేయడంతో, ఆమెను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బుని దొంగిలించి, మొబైల్ ఫోన్లనూ తీసుకుని పారిపోయినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!