'మహానటి' లో 'మూగ మనసులు' పాట ..
- April 21, 2018కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన మహానటి టీజర్ రిలీజై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా తొలి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'మూగ మనసులు.. మన్ను మిన్ను కలుసుకున్న సీమలో' అనే సిరివెన్నల సీతారామ శాస్త్రి గీతం ఆకట్టుకుంటోంది. మిక్కీ జే. మేయర్ సంగీతాన్ని అందించిన ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్, అనురాగ్ పాడారు. ఇక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ పాటకు అనుగుణంగా ఆడి పాడి అలరించారు. సెట్టింగ్స్ కూడా ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. మే 9న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అశ్వనీ దత్, కూతురు ప్రియాంకదత్ నిర్మాతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు