ప్లాస్టిక్ పొల్యూషన్ని అరికడదాం
- April 21, 2018
మనామా: 42వ యాన్యువల్ రాఫ్ట్ రేస్ సందర్భంగా 240 మంది ఔత్సాహికులు ప్లాస్టిక్ పొల్యూషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సల్మానియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అల్ బదర్ హోటల్ మరియు రిసార్ట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమం 'స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్' నినాదంతో ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ భూతం ప్రపంచానికి పెను విపత్తుగా మారుతోందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ వినియోగం క్రమక్రమంగా తగ్గించడం ద్వారా ప్రకృతి వనరుల్ని పరిరక్షించగలుగతామని వారు అభిప్రాయపడ్డారు. ఈ రేస్లో పాల్గొని విజేతలైనవారికి సర్టిఫికెట్లు అందజేశారు. గోల్డెన్ టులిప్ హోటల్లో ఈవెంట్ స్పాన్సరర్కి 'థ్యాంక్యూ లంచ్' ఏర్పాటు చేసినట్లు క్లబ్ పేర్కొంది.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







