లండన్ వెళ్లిపోయిన నవాజ్ షరీఫ్?
- April 21, 2018పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ దొంగచాటుగా లండన్ పారిపోయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, ఆయన అనుచరులు మాత్రం లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భార్యను చూసేందుకే ఆయన లండన్ వెళ్లారని చెపుతున్నారు.
అక్రమ రహదారి నిర్మాణానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎన్ఏబీ షరీఫ్కు సమన్లు జారీచేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ప్రధాని షరీఫ్పై అనర్హత వేటువేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పీఠాన్ని త్యజించారు.
ఈ పరిస్థితుల్లో నవాజ్ షరీఫ్ తన కుమార్తెతో కలిసి లండన్ వెళ్లారు. క్యాన్సర్ బారిన పడి లండన్ దవాఖానలో చికిత్స పొందుతున్న తన భార్య బాగోగులు చూసుకోవడానికి వెళ్లినట్టు సమాచారం. ఆయన తిరుగు ప్రయాణంపై ఎలాంటి సమాచారం లేదు.
మరోవైపు, ఈ నెల 21వ తేదీన లాహోర్లోని నేషనల్ ఎకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) సంయుక్త దర్యాప్తు బృందం ఎదుట ఆయన హాజరుకావాల్సి ఉంది. అలాగే, 23వ తేదీన అవినీతి కేసులో కూడా ఏప్రిల్ 23వ తేదీన ఆయన కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉన్నది. దాని నుంచి తప్పించుకొనేందుకు దేశాన్ని వీడారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఆయన తిరిగి ఇస్లామాబాద్కు వచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!