జిజాన్పైకి దూసుకొచ్చిన మిస్సైల్ కూల్చివేత
- April 21, 2018
జెడ్డా: సౌదీ అరేబియా దళాలు, హౌతీ మిలిటెంట్స్ సంధించిన మిస్సైల్ని విజయవంతంగా కూల్చేశాయి. పౌరులే లక్ష్యంగా పెద్దయెత్తున మిస్సైల్స్ని సంధిస్తూ వస్తున్నారు గత కొంతకాలంగా హౌతీ తీవ్రవాదులు. ఇరాన్ నుంచి అందుతున్న సహకారంతో తీవ్రవాదులు యెమెన్లో పెచ్చిపోతూ, అట్నుంచి సౌదీ వైపుగా మిస్సైల్స్ సంధిస్తుండగా, వాటిని అత్యంత వ్యూహాత్మకంగా సౌదీ దళాలు ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. జిజాన్లో ఆరామ్కో రిఫైనరీ మరియు కీలకమైన అనేక ఫెసిలిటీస్ వున్నాయి. రోజుకి 400,000 బ్యారెళ్ళ చమురుని వెలికి తీసే ప్రాజెక్టు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సౌదీ దళాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







