దోమల అదుపునకు
- April 22, 2018వాషింగ్టన్: సాంకేతిక పరిజ్ఞానంతో మగ దోమలకు వంధ్యత్వం కల్గించి తద్వారా దోమల వ్యాప్తిని, వాటి వల్ల వస్తున్న వ్యాధులను నియంత్రించవచ్చని రుజువైంది. వివిధ వ్యాధులను వ్యాప్తి చేస్తున్న దోమలను నియంత్రించేందుకు వీలుగా దోమలను వాతారణంలోకి వదిలే ప్రక్రియను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) విజయవంతంగా పరీక్షించింది. డ్రోన్ సహాయంతో ఆ దోమలను వాతావరణంలోకి అణు సాంకేతికతను వినియోగిస్తూ ప్రవేశపెడితే జికా, తదితర వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎఇఎ, యుఎనఒలోని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఒ), వురు రోబోటిక్స్ అనే స్వచ్ఛంద సంస్థ గతేడాది వంధ్య క్రిమి సాంకేతికత ఆధారిత దోమలను వదిలే విధానానికి రూపకల్పన చేశాయి. దీన్ని గత నెల బ్రెజిల్లో విజయవంతంగా పరీక్షించారు. డ్రోన్లలో ఉంచే మగ దోమలకు రేడియేషన్తో పునరుత్పత్తి సామర్థ్యాన్ని దూరంచేసి వాతావరణంలోకి విడిచిపెడతారు. అనంతరం ఈ దోమలు ఆడ దోమలతో కలిసినప్పటికీ సంతానం కలగదు. దోమలు వ్యాప్తి చెందవంటున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం