దుమారం లేపుతున్న మోడీ వ్యాఖ్యలు..
- April 22, 2018కామన్ వెల్త్ దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు గతవారం లండన్లో పర్యటించిన ప్రధాని మోడీ వైద్యుల గురించి చేసిన వ్యాఖ్యలపై తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్లర్టు, ఫార్మా కంపెనీల మధ్య అక్రమ అవగాహన వల్లే.. వైద్యులు ఖరీదైన మందులను సిఫారసు చేస్తున్నట్టు ప్రధాని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలపై ఆర్ధికభారం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
అయితే మోడీ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని చేసిన వ్యాఖ్యలు భారతీయ వైద్యులను అప్రతిష్ఠపాలు చేసేవిధంగా ఉన్నాయని ఆక్షేపించింది. ఈ మేరకు ఐఎంఏ ప్రధానమంత్రికి లేఖరాసింది. వైద్యులు గనుక లేకపోతే దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని.. ప్రస్తుత పరిస్థితులతోపాటు ప్రభుత్వాల విధానాల వల్ల వైద్య వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నది. విదేశాల్లో భారతీయ వైద్యులపై బురదజల్లే విధంగా మాట్లాడటం సరికాదని తెలిపింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం