ఈజిప్ట్ ఫోటో జర్నలిస్టుకు యునెస్కో పురస్కారం..మే 2న ప్రదానం
- April 23, 2018
పారిస్ : ప్రస్తుతం నిర్బంధంలో వున్న ఈజిప్ట్ ఫోటో జర్నలిస్టు మహ్మద్ అబూ జేడ్కు యునెస్కో వరల్ట్ ప్రెస్ ఫ్రీడం ప్రైజ్ లభించిందని ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం సోమవారం ప్రకటించింది. షాకాన్గా అందరికీ చిరపరిచితుడైన అబూ జేడ్ను 2013 ఆగస్టులో అరెస్టు చేశారు. కైరోలో భద్రతా బలగాలు, పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ మద్దతుదారుల మధ్య జరిగిన భయంకరమైన ఘర్షణలను ఆయన చిత్రీకరించినందుకు అరెస్టు చేశారు. ఈ ఘర్షణల సమయంలో పోలీసులను హతమార్చినందుకు, ఆస్తులను ధ్వంసం చేసినందుకు అభియోగాలను ఎదుర్కొంటున్న 700మందిలో ఆయన ఒకరు. షాకాన్ ప్రదర్శించిన ధైర్యం, సాహసాలకు, ప్రతిఘటనకు, భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల నిబద్ధతకు నివాళే ఈ అవార్డు అని యునెస్కో జ్యూరీ అధినేత మరియా రెస్సా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్రవాది, క్రిమినల్ చర్యల్లో నిందితుడు అయిన వ్యక్తికి యునెస్కో ఇంతటి పురస్కారం అందచేయడం పట్ల ఈజిప్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవమైన మే 2వ తేదీన షాకాన్కు ఈ బహుమతిని అందచేస్తామని యునెస్కో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!







