ఈజిప్ట్ ఫోటో జర్నలిస్టుకు యునెస్కో పురస్కారం..మే 2న ప్రదానం
- April 23, 2018పారిస్ : ప్రస్తుతం నిర్బంధంలో వున్న ఈజిప్ట్ ఫోటో జర్నలిస్టు మహ్మద్ అబూ జేడ్కు యునెస్కో వరల్ట్ ప్రెస్ ఫ్రీడం ప్రైజ్ లభించిందని ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం సోమవారం ప్రకటించింది. షాకాన్గా అందరికీ చిరపరిచితుడైన అబూ జేడ్ను 2013 ఆగస్టులో అరెస్టు చేశారు. కైరోలో భద్రతా బలగాలు, పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ మద్దతుదారుల మధ్య జరిగిన భయంకరమైన ఘర్షణలను ఆయన చిత్రీకరించినందుకు అరెస్టు చేశారు. ఈ ఘర్షణల సమయంలో పోలీసులను హతమార్చినందుకు, ఆస్తులను ధ్వంసం చేసినందుకు అభియోగాలను ఎదుర్కొంటున్న 700మందిలో ఆయన ఒకరు. షాకాన్ ప్రదర్శించిన ధైర్యం, సాహసాలకు, ప్రతిఘటనకు, భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల నిబద్ధతకు నివాళే ఈ అవార్డు అని యునెస్కో జ్యూరీ అధినేత మరియా రెస్సా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్రవాది, క్రిమినల్ చర్యల్లో నిందితుడు అయిన వ్యక్తికి యునెస్కో ఇంతటి పురస్కారం అందచేయడం పట్ల ఈజిప్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవమైన మే 2వ తేదీన షాకాన్కు ఈ బహుమతిని అందచేస్తామని యునెస్కో తెలిపింది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..