తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
- April 23, 2018
ప్రముఖ దర్శకుడు టీఎల్వీ ప్రసాద్కు మహారాష్ట్ర ప్రభుత్వం 'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2018' పురస్కారం అందజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఈ అవార్డు అందుకున్నారు. టీఎల్వీ ప్రసాద్ ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్రావు కుమారుడు. దాదాపు 85 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో 40 హిందీ చిత్రాలున్నాయి. మిథున్ చక్రవర్తితోనే ఏకంగా 35 చిత్రాలు తెరకెక్కించారు. ఓ తెలుగు దర్శకుడుబాలీవుడ్లో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించడంతో ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకులతో చిత్రాల్ని తెరకెక్కించారు. బాలీవుడ్లో కొన్ని ధారావాహికలు కూడా నిర్మించారు. ప్రస్తుతం హిందీలో 'జై శ్రీకృష్ణ', 'జైజైజై భజరంగభళీ' సీరియల్స్ని తెరక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం