తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
- April 23, 2018![9 తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం](https://www.maagulf.com/godata/articles/201804/tlv_1524549714.jpg)
ప్రముఖ దర్శకుడు టీఎల్వీ ప్రసాద్కు మహారాష్ట్ర ప్రభుత్వం 'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2018' పురస్కారం అందజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఈ అవార్డు అందుకున్నారు. టీఎల్వీ ప్రసాద్ ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్రావు కుమారుడు. దాదాపు 85 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో 40 హిందీ చిత్రాలున్నాయి. మిథున్ చక్రవర్తితోనే ఏకంగా 35 చిత్రాలు తెరకెక్కించారు. ఓ తెలుగు దర్శకుడుబాలీవుడ్లో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించడంతో ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకులతో చిత్రాల్ని తెరకెక్కించారు. బాలీవుడ్లో కొన్ని ధారావాహికలు కూడా నిర్మించారు. ప్రస్తుతం హిందీలో 'జై శ్రీకృష్ణ', 'జైజైజై భజరంగభళీ' సీరియల్స్ని తెరక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..