తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
- April 23, 2018ప్రముఖ దర్శకుడు టీఎల్వీ ప్రసాద్కు మహారాష్ట్ర ప్రభుత్వం 'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2018' పురస్కారం అందజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఈ అవార్డు అందుకున్నారు. టీఎల్వీ ప్రసాద్ ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్రావు కుమారుడు. దాదాపు 85 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో 40 హిందీ చిత్రాలున్నాయి. మిథున్ చక్రవర్తితోనే ఏకంగా 35 చిత్రాలు తెరకెక్కించారు. ఓ తెలుగు దర్శకుడుబాలీవుడ్లో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించడంతో ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకులతో చిత్రాల్ని తెరకెక్కించారు. బాలీవుడ్లో కొన్ని ధారావాహికలు కూడా నిర్మించారు. ప్రస్తుతం హిందీలో 'జై శ్రీకృష్ణ', 'జైజైజై భజరంగభళీ' సీరియల్స్ని తెరక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!