సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న అందాల భామ
- April 25, 2018
అగ్రహీరోలతో నటించటమేకాదు..తమకంటు ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని వివాహానంతరం కొంతమంది..వేరే కారణాలతో మరికొంతమంది సినిమా పరిశ్రమకు దూరమైన అనంతరం కొంత విరామం తరువాత మళ్లీ సినిమాలలోకి రావటం మామూలే. కొంతమంది రీ ఎంట్రీతో మళ్లీ సక్సెస్ బాటలో వుంటే ఇంకొందరు వచ్చిన పాత్రలతో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తానంటే సంకేతాలు ఇస్తోంది.
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన నిన్నటి తరం కథానాయికలలో అంజలా జవేరి ఒకరు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ ల సరసన కథానాయికగా చేసిన ఆమె .. చక్కటి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్న అంజలా జవేరీ సినిమాలకు దూరం వున్నారు. విరామం అనంతరం ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానని అంటున్నారు.
తెలుగులో నిన్నటి తరం కథానాయికలుగా ఒక వెలుగు వెలిగిన నదియా .. భూమిక .. సిమ్రాన్ .. ఖుష్బూ .. మీనా రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ పారితోషికాన్ని అందుకోవడంతో పాటు, మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. మరి వారిని చూసి స్ఫూర్తిని పొందిందో ఏమో తెలియదు గానీ, మంచి కథతో .. అవార్డులు తెచ్చిపెట్టే పాత్రలతో వస్తే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని అంజలా జవేరి చెప్పుకొచ్చారు. వెంకటేశ్,చిరంజీవి వంటి అగ్రహీరోలతో చేసిన మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలా జవేరీ రీ ఎంట్రీ ఎలా వుండనుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం