'మన మద్రాస్ కోసం' అనే పేరుతో సహాయ నిధుల సేకరణ ...
- December 05, 2015
మన మద్రాస్ కోసం!ఎడతెరిపిలేని వర్షాలతో కన్నీటి సంద్రమైన చెన్నై నగరానికి చేయూత అందించేందుకు తెలుగు చిత్రసీమ తన వంతు పాత్ర పోషిస్తోంది. 'మన మద్రాస్ కోసం' పేరిట వరద బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకుల్ని అందించడానికి తెలుగు తారలు నడుంబిగించారు. రామానాయుడు స్టూడియో కేంద్రంగా కొందరు నటులు దాతల నుంచి నిత్యావసర వస్తువుల్ని సేకరిస్తున్నారు. సరుకుల్ని ట్రక్కుల్లో చెన్నైకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు, కథానాయకుడు ప్రభాస్ కలసి వరద బాధితుల సహాయార్థం రూ. 15లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో వరద తాకిడికి గురైన ప్రాంతాల కోసం ప్రభాస్ రూ. 5 లక్షలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు ప్రభాస్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూ. 5 లక్షలు ప్రకటించింది. కథానాయిక రకుల్ప్రీత్ సింగ్ ఐదు వేల మంది కోసం ఆహారం, తాగునీరు పంపించనుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని కొన్ని వ్యాపార సముదాయాల దగ్గర తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు నటీనటులు విరాళాల్ని సేకరించబోతున్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత









