'మన మద్రాస్ కోసం' అనే పేరుతో సహాయ నిధుల సేకరణ ...
- December 05, 2015
మన మద్రాస్ కోసం!ఎడతెరిపిలేని వర్షాలతో కన్నీటి సంద్రమైన చెన్నై నగరానికి చేయూత అందించేందుకు తెలుగు చిత్రసీమ తన వంతు పాత్ర పోషిస్తోంది. 'మన మద్రాస్ కోసం' పేరిట వరద బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకుల్ని అందించడానికి తెలుగు తారలు నడుంబిగించారు. రామానాయుడు స్టూడియో కేంద్రంగా కొందరు నటులు దాతల నుంచి నిత్యావసర వస్తువుల్ని సేకరిస్తున్నారు. సరుకుల్ని ట్రక్కుల్లో చెన్నైకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు, కథానాయకుడు ప్రభాస్ కలసి వరద బాధితుల సహాయార్థం రూ. 15లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో వరద తాకిడికి గురైన ప్రాంతాల కోసం ప్రభాస్ రూ. 5 లక్షలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు ప్రభాస్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూ. 5 లక్షలు ప్రకటించింది. కథానాయిక రకుల్ప్రీత్ సింగ్ ఐదు వేల మంది కోసం ఆహారం, తాగునీరు పంపించనుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని కొన్ని వ్యాపార సముదాయాల దగ్గర తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు నటీనటులు విరాళాల్ని సేకరించబోతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







