'మన మద్రాస్ కోసం' అనే పేరుతో సహాయ నిధుల సేకరణ ...
- December 05, 2015
మన మద్రాస్ కోసం!ఎడతెరిపిలేని వర్షాలతో కన్నీటి సంద్రమైన చెన్నై నగరానికి చేయూత అందించేందుకు తెలుగు చిత్రసీమ తన వంతు పాత్ర పోషిస్తోంది. 'మన మద్రాస్ కోసం' పేరిట వరద బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకుల్ని అందించడానికి తెలుగు తారలు నడుంబిగించారు. రామానాయుడు స్టూడియో కేంద్రంగా కొందరు నటులు దాతల నుంచి నిత్యావసర వస్తువుల్ని సేకరిస్తున్నారు. సరుకుల్ని ట్రక్కుల్లో చెన్నైకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు, కథానాయకుడు ప్రభాస్ కలసి వరద బాధితుల సహాయార్థం రూ. 15లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో వరద తాకిడికి గురైన ప్రాంతాల కోసం ప్రభాస్ రూ. 5 లక్షలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు ప్రభాస్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూ. 5 లక్షలు ప్రకటించింది. కథానాయిక రకుల్ప్రీత్ సింగ్ ఐదు వేల మంది కోసం ఆహారం, తాగునీరు పంపించనుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని కొన్ని వ్యాపార సముదాయాల దగ్గర తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు నటీనటులు విరాళాల్ని సేకరించబోతున్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







