కొత్త చట్టాలతో 'దుబాయ్' స్మార్ట్ సిటీకి ఊతం
- December 05, 2015
దుబాయ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్కి ఊతమిచ్చేలా కొత్త చట్టాల్ని రూపొందించారు యూఏఈ వైఎస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు ఈ చట్టాలు ఉపకరించనున్నాయి. రెండేళ్ళ క్రితం ప్రకటించిన షేక్ మహమ్మద్ విజన్లో బాగంగా, ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్మార్ట్ నగరాల్లో ఒకటిగా దుబాయ్కి మరింత కీర్తిని తీసుకురావడానికి ఉపకరించేలా చట్టాల్ని రూపొందించారు. దుబాయ్ని సరికొత్తగా మలచేందుకు వీలుగా చట్టబద్ధమైన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మరియు లీగల్ ఫ్రేమ్ వర్క్ని పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ చెప్పారు. దుబాయ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేయబడిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. షేక్ మహమ్మద్ అనౌన్స్ చేసిన కొత్త చట్టాల ఆధారంగా పలు కమిటీలకు చట్ట బద్ధత లభించింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







