ఫేక్ గోల్డ్ విక్రయం: ఇద్దరి అరెస్ట్
- April 30, 2018
షార్జాలో ఫేక్ గోల్డ్ విక్రయిస్తోన్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ షార్జా పోలీస్, పెయింటెడ్ మెటల్ (3 కిలోలు) కలిగి వున్న ఇద్దర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్కియాలజీ సైట్ నుంచి తాము బంగారాన్ని వెలికి తీశామని చెబుతూ, అమాయకుల్ని ఈ నిందితులు మోసం చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బంగారాన్ని అధీకృత బంగారు వ్యాపార సంస్థల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనీ, తక్కువ ధర పేరుతో నకిలీ బంగారాన్ని విక్రయించే వారి పట్ల అప్రమత్తంగా వుండాలని షార్జా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఇబ్రహీమ్ ముసాబా అల్ అజెల్ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









