శ్రీదేవి తరుపున నేషనల్ అవార్డు అందుకోనున్న కూతురు ఖుషీ కపూర్
- May 02, 2018
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 65వ జాతీయ సినీ అవార్డుల్లో ప్రముఖనటి, దివంగత శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'మామ్' చిత్రంలో నటనకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
కాగా, జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేడు (మే 3) ఢిల్లీలో జరుగనుంది. శ్రీదేవి తరుపున ఆమె చిన్న కూతురు ఖుషీ కపూర్ ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఈ వేడుకకు శ్రీదేవి భర్త, 'మామ్' నిర్మాత బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్లతో కలిసి హాజరు కాబోతున్నారు.
శ్రీదేవి తన కెరీర్లో పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది మాత్రం 'మామ్' చిత్రానికే. దీన్ని అందుకోవడానికి తమ అభిమాన నటి లేక పోవడం విచారకరమని పలువురు ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
తన బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి హోటల్ గదిలోని బాత్ టబ్లో ప్రమాదవ శాత్తు పడిపోయి మరణించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న దుబాయ్లో ఆమె మరణించగా, ఫిబ్రవరి 28న ఇండియాలో అంత్యక్రియలు నిర్వహించారు. అతిలోక సుందరి అంతిమ యాత్రలో లక్షలాది మంది అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









