శ్రీదేవి తరుపున నేషనల్ అవార్డు అందుకోనున్న కూతురు ఖుషీ కపూర్
- May 02, 2018![9 శ్రీదేవి తరుపున నేషనల్ అవార్డు అందుకోనున్న కూతురు ఖుషీ కపూర్](https://www.maagulf.com/godata/articles/201805/thu_1519550325_1525329388.jpg)
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 65వ జాతీయ సినీ అవార్డుల్లో ప్రముఖనటి, దివంగత శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'మామ్' చిత్రంలో నటనకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
కాగా, జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేడు (మే 3) ఢిల్లీలో జరుగనుంది. శ్రీదేవి తరుపున ఆమె చిన్న కూతురు ఖుషీ కపూర్ ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఈ వేడుకకు శ్రీదేవి భర్త, 'మామ్' నిర్మాత బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్లతో కలిసి హాజరు కాబోతున్నారు.
శ్రీదేవి తన కెరీర్లో పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది మాత్రం 'మామ్' చిత్రానికే. దీన్ని అందుకోవడానికి తమ అభిమాన నటి లేక పోవడం విచారకరమని పలువురు ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
తన బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి హోటల్ గదిలోని బాత్ టబ్లో ప్రమాదవ శాత్తు పడిపోయి మరణించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న దుబాయ్లో ఆమె మరణించగా, ఫిబ్రవరి 28న ఇండియాలో అంత్యక్రియలు నిర్వహించారు. అతిలోక సుందరి అంతిమ యాత్రలో లక్షలాది మంది అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు