ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- July 26, 2024
శ్రీలంక: సొంతగడ్డ పై జరుగుతున్న మహిళల ఆసియా కప్లో శ్రీలంక ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు (శుక్రవారం) జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో పాకిస్థాన్ పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో కెప్టెన్ చమరి ఆటపట్టు(63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరసింది. అనుష్కా సంజీవని(24 నాటౌట్), సుగంధిక కుమారిలు(10) అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
దంబుల్లా స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ అమ్మాయిలు దంచేశారు. ఓపెనర్లు గుల్ ఫెరొజా(25), మునీబా అలీ (37)లు శుభారంభమిచ్చి పునాది వేశారు. తొలి వికెట్కు 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ నిడా దార్(23) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. ఆఖర్లో ఫాతిమా సనా(23 నాటౌట్), అలియా రియాజ్(16 నాటౌట్)లు ధనాధన్ ఆడటంతో పాక్ జట్ట అనూహ్యంగా 140 రన్స్ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









