'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- July 27, 2024
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు డల్లాస్, దుబాయ్ లలో నిర్మాణ రంగంలో గణనీయమైన విజయాలు నమోదు చేస్తున్న అన్వితా గ్రూప్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అవుట్ లుక్ బిజినెస్ స్పాట్ లైట్ రియాల్టీ అవార్డుల కార్యక్రమంలో మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు 2024ను సొంతం చేసుకుంది.హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణ వేదికగా శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సినీ కధానాయిక శృతి హాసన్ చేతుల మీదుగా అన్వితా గ్రూపు ఎండి అచ్యుత రావు బొప్పన ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో నూతన అవిష్కరణల స్వీకరణ అనే అంశంపై జరిగిన చర్చలో అచ్యుతరావు బొప్పన మాట్లాడుతూ నూతనత్వాన్ని స్వాగతిస్తూ అంతర్జాతీయ పోకడలకు అనుగుణంగా మార్పుకు సిద్దం కావాలన్నారు. వినియోగదారుని ఆసక్తికి అనుగుణంగా భవన నిర్మాణాలు సాగినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయన్నారు.అన్వితా గ్రూపు రానున్న కాలంలో కోటి చదరపు అడుగుల విస్త్రీర్ణాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రానుందని వివరించారు. చర్చలో హానర్ హోమ్స్ డైరెక్టర్ స్వప్న కుమార్, నీమ్స్ బోరో గ్రూపు ఎండి కృష్ణ భగవాన్ పాల్గొన్నారు.అవుట్ లుక్ బిజినెస్ ఎడిటర్ సుచేతనా రాయ్ కీలకోపన్యాసం చేయగా, అన్వితా గ్రూపు డైరెక్టర్లు సరిత కాకర్ల, అనూప్ బొప్పన, అన్విత బొప్పన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









