చైనాలో భారీ వంతెన నిర్మాణం
- May 06, 2018
బీజింగ్ : చైనాలో భారీ వంతెన నిర్మాణం పూర్తయింది. చైనా నిర్మించిన హాంకాంగ్-జుహై మకౌ బ్రిడ్జీ పొడవు 34 మైళ్లు (దాదాపు 55 కిలోమీటర్లు). ఇది ప్రపంచంలోనే అతిపొడవైన ఆనకట్ట. పెరల్ రివర్ డెల్టా ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జీ నిర్మాణం కోసం 20 బిలియన్ డాలర్లు ( రూ.1,33,641 కోట్లు) ఖర్చయింది. బలమైన ఈదురుగాలులు, ప్రకృతి విపత్తులను తట్టుకునే సామర్థ్యం ఈ వంతెనలో ఉందని అసిస్టెండ్ డైరెక్టర్, సీనియర్ ఇంజినీర్ గువా జింగ్లిన్ తెలిపారు. హాంకాంగ్, మకావు నగరాలను చైనాలోని మెయిన్ల్యాండ్ వంతెన కలుపుతుందని అన్నారు. ఈ మూడు ప్రాంతాలకు ప్రయాణించేందుకు గతంలో మూడు గంటల సమయం పట్టేదన్నారు. అయితే, ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం అరగంటలోపే గమ్యాన్ని చేరుకోవచ్చుని అన్నారు. చైనా నిర్మించిన కట్టడాల్లో ఇది చరిత్రాత్మకంగా మిగిలిపోతుందన్నారు. ఈ ఆనకట్టను వీక్షించేందుకు పర్యాటకుల తాకిడి బాగా పెరిగే అంచనాలున్నాయని జింగ్లిన్ అన్నారు.
ఈ వంతెనపై ప్రతీరోజు 40వేల వాహనాలు ప్రయాణించే అవకాశముందని చైనా రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. వంతెనపై గరిష్ట వేగం 100కిలోమీటర్లు ఉండేలా నిబంధనలు విధిస్తామని అన్నారు. ఈ బ్రిడ్జీ ప్రారంభమైన తర్వాత చైనా వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







