చైనాలో భారీ వంతెన నిర్మాణం
- May 06, 2018
బీజింగ్ : చైనాలో భారీ వంతెన నిర్మాణం పూర్తయింది. చైనా నిర్మించిన హాంకాంగ్-జుహై మకౌ బ్రిడ్జీ పొడవు 34 మైళ్లు (దాదాపు 55 కిలోమీటర్లు). ఇది ప్రపంచంలోనే అతిపొడవైన ఆనకట్ట. పెరల్ రివర్ డెల్టా ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జీ నిర్మాణం కోసం 20 బిలియన్ డాలర్లు ( రూ.1,33,641 కోట్లు) ఖర్చయింది. బలమైన ఈదురుగాలులు, ప్రకృతి విపత్తులను తట్టుకునే సామర్థ్యం ఈ వంతెనలో ఉందని అసిస్టెండ్ డైరెక్టర్, సీనియర్ ఇంజినీర్ గువా జింగ్లిన్ తెలిపారు. హాంకాంగ్, మకావు నగరాలను చైనాలోని మెయిన్ల్యాండ్ వంతెన కలుపుతుందని అన్నారు. ఈ మూడు ప్రాంతాలకు ప్రయాణించేందుకు గతంలో మూడు గంటల సమయం పట్టేదన్నారు. అయితే, ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం అరగంటలోపే గమ్యాన్ని చేరుకోవచ్చుని అన్నారు. చైనా నిర్మించిన కట్టడాల్లో ఇది చరిత్రాత్మకంగా మిగిలిపోతుందన్నారు. ఈ ఆనకట్టను వీక్షించేందుకు పర్యాటకుల తాకిడి బాగా పెరిగే అంచనాలున్నాయని జింగ్లిన్ అన్నారు.
ఈ వంతెనపై ప్రతీరోజు 40వేల వాహనాలు ప్రయాణించే అవకాశముందని చైనా రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. వంతెనపై గరిష్ట వేగం 100కిలోమీటర్లు ఉండేలా నిబంధనలు విధిస్తామని అన్నారు. ఈ బ్రిడ్జీ ప్రారంభమైన తర్వాత చైనా వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







