హెచ్చరిక : ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు, భారీ వర్షం పడే అవకాశం..
- May 11, 2018ఒడిశా రాష్ట్రంలో నెలకొన్న ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తాను ఆవరించింది.. దీంతో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలోని ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ముందస్తు హెచ్చరిక జారీచేసింది ఐఎండీ.. దీంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలు ఎక్కడం, ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండటం. ఎత్తైన చెట్లను ఆనుకుని ఉండటం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేయడం వలన పిడుగు ఆ ప్రదేశాలను ఎక్కువగా ఆకర్షిస్తోందని దానివలన ప్రమాదం జరగవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్