32 మందికి పైగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హతం..
- December 07, 2015
సిరియాపై.. యూఎస్ ఆధ్వర్యంలోని సంకీర్ణ దళాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఆదివారం జరిపిన భీకరదాడుల్లో 32 మందికి పైగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరియాలో గత ఆరు రోజులుగా కొనసాగుతున్న వైమానికి దాడులు రఖ్వా ప్రావిన్స్ లో భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సిరియాలో ఉత్తర, తూర్పు ప్రాంతాలలో తలదాచుకున్న జిహాదీలను మట్టుపెట్టే లక్ష్యంతో సంకీర్ణ దళాలు భీకరమైన పేలుళ్లకు పాల్పడుతోంది. ఉగ్రవాద సంస్థ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. కాగా ఇటీవల దాడుల నేపథ్యలో ఐఎస్ఎస్ ఉగ్రవాదులు.. రఖా వైపుకు పారిపోతున్నట్టు వార్తల నేపథ్యంలో రఖా టార్గెట్ గా దాడులకు దిగింది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు సిరియాపై భీకరంగా వైమానిక దాడులు చేస్తున్నాయి. పారిస్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఆ దాడులను మరింత ముమ్మరం చేశాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







