'మహానటి' చూడాలని ఉంది - బాలీవుడ్ నటి రేఖ
- May 15, 2018మహానటి సినిమా తరవాత అనేక ఆసక్తి కరమైన నాటి విషయాలు ఈ తరం యువతకు తెలుస్తున్నాయి. సావిత్రి జీవిత కథలో, సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9 (బుధవారం)న విడుదలై ఘన విజయం సాధించింది. సినిమాకు ప్రముఖులే కాదు ప్రజలనుండీ అందరి ప్రశంసలు అందుతున్నాయి. అయితే మరి ఆ కుటుంబ సభ్యులకు కూడా అలాగే అందరిని మించిన ఆత్రుత ఉంటుంది కదా! అయితే మహనటి సినిమాను చూడాలని ఉందని జెమిని గణేషన్ తో సహజీవనం చేసిన సినీనటి పుష్పవల్లి (జెమిని జీవితం లో జనానికి తెలిసిన రెండవ భార్య వివాహం చేసుకున్న వివరాలు తెలియదు) కుమార్తే బాలీవుడ్ ప్రఖ్యాత సీనియర్ నటి రేఖ అన్నారు.
ఇది తన పిన్ని కథ అని, తన తండ్రి గురించి కూడా సినిమాలో ఉందని, అందుకే సినిమా చూడాలని కొరుకుంటున్నాని చెప్పుకొచ్చింది. నాన్న ఙ్జాపకాలు నెమఱువేసుకునే అవకాశం కలుగుతున్ దన్నారు. మొదట తన సవతితల్లి సావిత్రి జీవితకథపై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని, తన తండ్రి గురించి ఎక్కడ చేడుగా చూపిస్తా రనే భయం తనకు ఉండేదని చేప్పిందట రేఖ. తరువాత కొంతకాలం ఆగి చూద్ధామనుకుందట. అందుకే కొంతకాలం నిశ్శబ్ధంగా ఉండిపోవాలనుకుందట. ఇప్పుడు మళ్లీ సినిమా చూడాలని ఉందని ఆమె ముంబై లో పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా విడుదలైన తర్వాత తన స్వంత సోదరి రాధ ద్వారా సినిమా చూడాలని ఉందని నిర్మాతలకు రేఖ తెలియజేసిందని సమాచారం. జీవితం విషయం లో రెఖ జీవిత చరిత్ర మహానటికి ఏమాత్రం తీసిపోదు. నటనలో కూడా రేఖ హిమోన్నతమే. జీవితమంతా ఒడిదుడుకులు బాల్యం అనిశ్చితం. వృత్తిలో మలుపులనేకం జీవితంలో కూడా అంతే. బయోపిక్ తీస్తే ఈమె జీవితం కూడా మహనటిని మించిన గొప్ప చిత్రంగా రూపొందించ వచ్చంటారు.
తాజా వార్తలు
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..