హైదరాబాద్:డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్సులో ఉచిత శిక్షణ
- May 18, 2018
హైదరాబాద్:నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణతోపాటు ఉపాధిని కల్పించే లక్ష్యంగా ఉపాధి శిక్షణ శాఖ నిరంతరం కృషి చేస్తుందని శాంతినగర్ ఐటీఐ ప్రిన్సిపల్ పసుపులేటి శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద నిరుద్యోగ యువతీయువకులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్సులో ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కోర్సులో శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులన్నారు. ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు వయసు పరిమితి లేదన్నారు. జూన్ 1వ తేదీ నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి అర్హతగల వారు ఈ నెలాఖరులోపు మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్లోని శాంతినగర్ ప్రభుత్వ ఐటీఐలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మరింత సమాచారం కోసం 9440068152 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







