వైరస్ కలకలం: ప్రజల ప్రాణాలు తీస్తున్న 'నిఫా' వైరస్.. 15మంది మృతి!

- May 21, 2018 , by Maagulf
వైరస్ కలకలం: ప్రజల ప్రాణాలు తీస్తున్న 'నిఫా' వైరస్.. 15మంది మృతి!

కేరళలోని కోజికోడ్ జిల్లాలో పెరంబాబ్రా ప్రాంతంలో  విష జ్వరాలు ప్రబలాయి.  ఇప్పటికే  ఈ విష జ్వరాల  కారణంగా 9 మంది మరణించారు. దాదాపు  26 మంది విషమపరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వీరి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు  గుర్తు తెలియని వైరస్ సోకడంతో   విష జ్వరాలు సోకాయని  వైద్యులు గుర్తించారు.  దీంతో  అప్రమత్తమైన  కేరళ ప్రభుత్వం   కేంద్రం సహయం కోరింది. మరణించిన వారిలో ఇద్దరికి నిఫా వైరస్‌ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మిగతా వారికి సోకిన వైరస్  గుర్తించడం కోసం  శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. వ్యాధి సోకిన పందులు, ఇతర సంక్రమిత జంతువులు ద్వారా లేదా కలుషితమైన పండ్లు (గబ్బిలాలు  సగం తినే పండ్లను తినడం) ద్వారా ఈ వైరస్‌ సోకుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com