సముద్రానికి చేరిన కిలావుయా అగ్నిపర్వతం..
- May 21, 2018
దాదాపు 15 రోజులుగా అమెరికా వాసులను భయపెడుతోంది కిలావుయా అగ్నిపర్వతం. హవాయి ద్వీపంలోని ఈ అగ్నిపర్వతం విస్పోటనంతో చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా నాశనమయ్యాయి. వందలాది ఇళ్లను, రోడ్లపై పార్క్ చేసిన కార్లు సైతం అగ్నిగి ఆహుతి అయ్యాయి. రోడ్లపై లావా ప్రవహిస్తుండడంతో విషవాయువులు గాల్లో కలుస్తున్నాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ముందస్తు హెచ్చరికలతో ఖాళీ చేయించారు. విషవాయువుల ప్రభావానికి గురికాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అధికారులు మాస్క్లు అందిస్తున్నారు. తాజాగా ఈ లావా రోడ్డుపై నుంచి సముద్ర తీరం దగ్గర్లోకి వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే సైంటిస్ట్ వెండీ స్టోవల్ తెలిపారు. సముద్రతీర వాసులను, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను, బీచ్కు వెళ్లే వారిని అప్రమత్రంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రంలోకి ఎవరూ వెళ్లవద్దని, బోట్లను కూడా సముద్రం ఒడ్డున ఉంచవద్దని హెచ్చరిస్తూ సివిల్ డిఫెన్స్ నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







