సముద్రానికి చేరిన కిలావుయా అగ్నిపర్వతం..
- May 21, 2018
దాదాపు 15 రోజులుగా అమెరికా వాసులను భయపెడుతోంది కిలావుయా అగ్నిపర్వతం. హవాయి ద్వీపంలోని ఈ అగ్నిపర్వతం విస్పోటనంతో చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా నాశనమయ్యాయి. వందలాది ఇళ్లను, రోడ్లపై పార్క్ చేసిన కార్లు సైతం అగ్నిగి ఆహుతి అయ్యాయి. రోడ్లపై లావా ప్రవహిస్తుండడంతో విషవాయువులు గాల్లో కలుస్తున్నాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ముందస్తు హెచ్చరికలతో ఖాళీ చేయించారు. విషవాయువుల ప్రభావానికి గురికాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అధికారులు మాస్క్లు అందిస్తున్నారు. తాజాగా ఈ లావా రోడ్డుపై నుంచి సముద్ర తీరం దగ్గర్లోకి వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే సైంటిస్ట్ వెండీ స్టోవల్ తెలిపారు. సముద్రతీర వాసులను, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను, బీచ్కు వెళ్లే వారిని అప్రమత్రంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రంలోకి ఎవరూ వెళ్లవద్దని, బోట్లను కూడా సముద్రం ఒడ్డున ఉంచవద్దని హెచ్చరిస్తూ సివిల్ డిఫెన్స్ నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!









