యు.ఏ.ఈ:వాట్సాప్ వాయిస్ నోట్పై హెచ్చరిక
- May 25, 2018
యు.ఏ.ఈ:వాట్సాప్ వంటి యాప్ల ద్వారా టెక్స్ మెసేజ్లను పంపి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు అక్రమార్కులు. తాజాగా వీరు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. వాట్సాప్లో వాయిస్ నోట్ ద్వారా అమాయకుల్ని మోసం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. 200,000 దిర్హామ్లు గెల్చుకున్నారంటూ యూఏఈలోని ప్రముఖ హైపర్ మార్కెట్ ఛెయిన్ పేరుతో వాయిస్ నోట్స్ని సర్క్యులేట్ చేస్తున్నారు. లులు హైపర్ మార్కెట్ పేరుతో ఈ దుష్ప్రచారం జరుగుతోంది. అయితే లులు సంస్థ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. లులు సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టబోదని ఆ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది. తమ సంస్థ నుంచి ఎవరూ ఫోన్ చేయడంగానీ, టెక్స్ట్ మెసేజ్లు చేయడంగానీ, వాయిస్ నోట్స్ పంపడంగానీ జరగదనీ, అలా ఎవరైనా ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్, బ్యాంక్ డిటెయిల్స్ అడిగితే తమకు సంబంధం లేదని లులు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







