ఘనంగా ప్రారంభమైన మహానాడు
- May 27, 2018తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు , నేతలు ఎంతో ఘనంగా జరుపుకునే మహానాడు వేడుక ఈరోజు విజయవాడలోని కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి మూడురోజుల పాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర ప్రాంతాలనుండి కూడా భారీగా కార్య కర్తలు , అభిమానులు చేరుకున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే చివరి మహానాడు ఇదే కావడంతో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది.
మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు డ్వాక్రా బజార్, ఫోటో ప్రదర్శన ప్రారంభించి.. తిలకించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి.. రక్తదాతలను అభినందించారు.మహానాడులో మొత్తం 36 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వివిధ అంశాల్లో కేంద్రం వైఖరిని ఖండించేందుకే ప్రత్యేకంగా నాలుగు తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. మహానాడు సందర్భంగా విజయవాడ నగరం అంత పసుపు మాయంగా మారింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు