టర్కీ: తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ పీఎస్ శశాంక్ కొడుకు హత్య
- May 28, 2018
ఇస్తాంబుల్: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ కొడుకు శుభమ్ గోయల్(24) టర్కీలోని ఇస్తాంబుల్లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మే 24న జరిగింది. దోపిడీ దొంగలు శుభమ్ను గన్తో కాల్చి చంపారు.
శుభమ్ అంత్యక్రియలు ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఆదివారం పూర్తయ్యాయి. కుమారుడి హత్య గురించి తెలిసిన వెంటనే శశాంక్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అక్కడ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో మాట్లాడి తన కొడుకు మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు ఏర్పాటు చేశారు. గత శనివారం శుభమ్ డెడ్బాడీ ఢిల్లీకి చేరుకోగా.. వెంటనే అక్కడి నుంచి శశాంక్ స్వగ్రామం రూర్కీకి తరలించారు.
యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శుభమ్ ఫ్రెండ్తో హాలీడే ట్రిప్ కోసం ఇస్తాంబుల్ వెళ్లాడు. అక్కడ దోపిడీ దొంగలకు వీళ్లు ఎదురుపడ్డారు. దీంతో శుభమ్, అతడి ఫ్రెండ్ సుభన్షును దొంగలు వాళ్ల దగ్గర ఉన్న డబ్బులు, నగలు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. శుభమ్ గోయల్ తమ దగ్గర ఉన్న డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో అతడిపై దాడి చేసిన దొంగలు ముందుగా కత్తితో పోడిచి అనంతరం గన్తో కాల్చి చంపారు.
"ఏప్రిల్ 28న బంధువుల పెండ్లికి శుభమ్ హాజరయ్యాడు. తర్వాత యూఎస్లోని కాలిఫోర్నియాకు శుభమ్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణం వాయిదా పడటంతో శుభమ్, అతడి ఫ్రెండ్ సుభన్షు కలిసి టర్కీ ట్రిప్పుకు బయలుదేరారు. కాని.. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది" అని శుభమ్ తాత డీబీ గోయల్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







