ఆఫ్రికాలో శ్రీశ్రీ రవిశంకర్ 'మహా ధ్యానం'
- May 28, 2018
ఆఫ్రికా ఖండంలో శాంతి స్థాపనే లక్ష్యంగా మహా ధ్యాన కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక నేత, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్ నిర్వహించారు. దీనిలో లక్ష మందికిపైగా ఆఫ్రికావాసులు వెబ్క్యామ్ల సాయంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆఫ్రికాలో నిర్వహించడం ఇది ఆరోసారి. దీనిలో 20 ఆఫ్రికా దేశాలవాసులతోపాటు ఇతర దేశాల పౌరులూ పాల్గొన్నారు. ఉగాండాలోని పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్న 66 మంది ఖైదీలూ దీనిలో పాలుపంచుకొన్నారు. ఎక్కువ మందికి చేరువ కావడమే లక్ష్యంగా రవిశంకర్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని ఆఫ్రికా వ్యాప్తంగా రేడియోల్లో ప్రసారంచేశారు. దీనిలో ధ్యానంతో ఒనగూరే అమూల్యమైన ప్రయోజనాల గురించి రవిశంకర్ వివరించారు. కార్యక్రమానికి మంచి స్పందన లభించిన నేపథ్యంలో.. మరో వారం రోజులపాటు దీన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







