తలైవా కు షాక్ ఇచ్చిన కర్ణాటక
- May 29, 2018
బెంగళూరు : కావేరీ నది జలాల వివాదంపై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు రజినీకాంత్ కు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ షాక్ ఇచ్చింది . రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ సినీనటుడు రజినీకాంత్ తాజాగా నటించిన 'కాలా' చిత్రాన్ని కర్ణాటక రాష్ట్రంలో విడుదల చేయరాదని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఇప్పటికే ట్రైలరు విడుదలైన 'కాలా' చిత్రం జూన్ 7వతేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. కావేరీ నదీ జలాల వివాదంపై రజినీకాంత్ కర్ణాటక రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఆయన నటించిన 'కాలా' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకుండా చూడాలని కన్నడ సంఘాలు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పై ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో తాము 'కాలా' చిత్రాన్ని విడదల చేయకుండా నిషేధం విధించామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గోవింద్ చెప్పారు. చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో చర్చించి 'కాలా'ను విడుదల చేయరాదని నిర్ణయించినట్లు గోవింద్ వివరించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







