తలైవా కు షాక్ ఇచ్చిన కర్ణాటక
- May 29, 2018
బెంగళూరు : కావేరీ నది జలాల వివాదంపై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు రజినీకాంత్ కు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ షాక్ ఇచ్చింది . రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ సినీనటుడు రజినీకాంత్ తాజాగా నటించిన 'కాలా' చిత్రాన్ని కర్ణాటక రాష్ట్రంలో విడుదల చేయరాదని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఇప్పటికే ట్రైలరు విడుదలైన 'కాలా' చిత్రం జూన్ 7వతేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. కావేరీ నదీ జలాల వివాదంపై రజినీకాంత్ కర్ణాటక రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఆయన నటించిన 'కాలా' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకుండా చూడాలని కన్నడ సంఘాలు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పై ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో తాము 'కాలా' చిత్రాన్ని విడదల చేయకుండా నిషేధం విధించామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గోవింద్ చెప్పారు. చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో చర్చించి 'కాలా'ను విడుదల చేయరాదని నిర్ణయించినట్లు గోవింద్ వివరించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్







